ఏపీలో మరో 141 కరోనా పాజిటివ్ కేసుల నమోదు

  • ఏపీలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాప్తి
  • గత 24 గంటల్లో 30,752 కరోనా పరీక్షలు
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 27 కొత్త కేసులు
  • రాష్ట్రంలో రెండు కరోనా మరణాలు
  • ఇంకా 1,073 మందికి చికిత్స
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 30,752 శాంపిల్స్ పరీక్షించగా, 141 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 165 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,76,687 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,122 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,073 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,492కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Today Cases
Media Bulletin

More Telugu News